గుర్లలోని కేజీవీబీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థుల డార్మెటరీ గదిలో పరుపులు ఇతర సామగ్రి కాలి బూడిద అయ్యాయి. దీంతోపాటు ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Continue Read
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుపానుగా కొనసాగుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుపాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
Continue Read
53వ వార్డులో పునరావాస కేంద్రాల పరిశీలన అక్షర కిరణం (మర్రిపాలెం): జోన్ 5 పరిధిలో 53 వార్డులోని పునరావాస కేంద్రాలను మాజీ కార్పొరేటర్ పొలమరశెట్టి వెంకట నర్స కుమారి మంగళవారం పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు
Continue Read
ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఆప్టా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Continue Read
మొంథా తుఫాన్పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Continue Read
ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆరో రోజు.. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIదీజ) ప్రతినిధులతో మెల్బోర్న్ లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్లో నిర్వహిం చిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Continue Read
కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికి తీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Continue Read
ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక నవజాత శిశువుకు తీరని అన్యాయం జరిగింది. ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఆ పసికందు చేయిని పూర్తిగా తొలగించాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడిరది.
Continue Read