logo
సాధారణ వార్తలు

లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

: లండన్‌ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Continue Read
సినిమా, సాంస్కృతిక, మరియు ఆధ్యాత్మిక

తిరుమల శ్రీవారికి భారీ వెండి కానుక

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు మంగళవారం (నవంబర్‌ 4) తిరుమల శ్రీవారికి కానుక ఇచ్చారు. 22 కిలోల వెండితో చేసిన భారీ గంగాళా న్ని అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న శ్రీనివాసులు రెడ్డి.. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే వెండి గంగాళాన్ని విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం కొత్త అప్‌డేట్‌

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్‌ డేట్‌ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు  నిర్ణయించింది.

Continue Read
రాజకీయ సంబంధితమైనవి

కరూర్‌ తొక్కిసలాట ఘటనతో విజయ్‌ కీలక నిర్ణయం

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మరోసారి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఓ మంచి పని చేయబోతున్నారు. ముఖ్యంగా రద్దీ నిర్వహణ, ప్రజా భద్రతను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక వాలంటీర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ‘తొండర్‌ అని’ అని పేరు పెట్టారు.

Continue Read
banner image
సాధారణ వార్తలు

వైఎస్‌ జగన్‌ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో జగన్‌ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్‌ జగన్‌ కాన్వాయి లో ప్రమాదం జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

కాశీబుగ్గలో తీవ్ర విషాదం కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను తక్షణం బ్యాన్‌ చేయాల్సిందే: సర్దార్‌ పటేల్‌ చేసింది అదే

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కువ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ హత్య తరువాత సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.

Continue Read
నేరలు

సినిమా ఆడిషన్‌ పేరుతో 17 మంది పిల్లలను కిడ్నాప్‌ చేసిన సైకో

మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పిల్లలను కిడ్నాప్‌ చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని పేర్కొంటూ.. కొంత మంది పిల్లలను ఆడిషన్‌కు పిలిచాడు. అలా 17 మంది పిల్లలు రాగా.. వారిని బంధించాడు. పిల్లలను రెస్క్యూ చేస్తున్న సమయంలో.. ఎయిర్‌ గన్‌తో రోహిత్‌ ఆర్య.. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా.. పోలీసులు కూడా ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు రోహిత్‌ ఆర్య మరణించాడు.

Continue Read