జూన్ 4 ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం
కచంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ట్వీట్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన రోజు 2024లో ఇదే రోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కూటమి విజయానికి ఏడాది పూర్తి కావడంతో అందరూ ప్రభుత్వా నికి శుభాకాంక్షలు తెలియజేస్తు న్నారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ట్వీట్లు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘జూన్ 4 ప్రజాతీర్పు దినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు.. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు.. సైకో పాలనకు అంతం పలికి.. ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు.. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు.. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు.. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమల నాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు’ అన్నారు.
‘ఏడాది కిందట ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు ప్రజలు పెట్టుకున్న నమ్మకా న్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెట్టి.. సంక్షేమాన్ని అందిస్తూ... అభివృద్ధి పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా మని మాట ఇస్తున్నాము. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు, ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్..జై జై ఆంధ్రప్రదేశ్!’ అంటూ ట్వీట్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూటమి గెలుపుపై ట్వీట్ చేశారు. ‘ప్రజా తీర్పునకు ఏడాది.. ప్రజా చైతన్యానికి ఏడాది.. ప్రజా స్వామ్య పరిరక్షణకు ఏడాది.. కూటమి చారిత్రక విజయానికి ఏడాది.. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది.. 2024 జూన్ 4 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు... ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు’ అన్నారు. అంటూ ట్వీట్ చేశారు.
మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. సంవత్సరం కిందట ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలి చారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజల ఆకాంక్షలు విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు నాయుడు గారి పాలనానుభవం, పవనన్న ఆశయానికి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్ని ర్మాణం ప్రారంభమైంది. ప్రజాప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.