ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా?
కవైసీపీ అరాచక పాలనకు గొడ్డలి వేటు జూన్ 4 కమంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు అంటారా, ప్రజలనే అనమానిస్తారా అంటూ మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. సైకో జగన్ అనే వైరస్ను ఓటు అనే శానిటైజర్తో ప్రజలు ప్రక్షాళన చేసిన రోజు జూన్ 4 అని స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలోని తన నివాసంలో కూటమి నాయకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. జూన్ 4వ.తేదీ అంటే వైఎస్ జగన్ అరాచకపాలనకు రాష్ట్ర ప్రజలు చరమ గీతంపాడిన రోజని ఏద్దవాచేశారు.
సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఈ మూడు పండుగలు ఒకేసారి వచ్చిన రోజని అన్నారు. జూన్ 4వ.తేది అంటే వెన్నుపోటు, గొడ్డలివేటుకు పేటెంట్ జగన్ రెడ్డి దేనని విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారని ధ్వజమెత్తారు. ఎత్తుకొని పెంచిన బాబాయిని చంపిన కిరాతుకులను కాపాడుతూ రక్త సంబంధానికే జగన్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆస్తికోసం తల్లి, చెల్లిని ఇంటి నుండి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కూటమి పాలనలో తొలిఏడాదిలోనే 70 శాతం హామీలు అమలుచేసి గిరిజన సంక్షేమానికి రూ.1300కోట్లు కేటాయించామ న్నారు. మొదటి నెల లోనే 4000పెన్షన్లు పెంచి అమలు చేశామని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ సాలూరు పట్టణ నాయకులు నిమ్మాది తిరుపతి, నాయకులు పరమేష్, కె.భీమా, శ్యాము, సూర్యనారాయణ, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.