మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టు సభ్యురాలు శ్రీచరణికి రూ.2.5 కోట్లు, వెయ్యి చదరపు గజాల నివాస స్థలం బహుమతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమెకు గ్రూప్-1 పోస్టు కూడా ఇచ్చారు.
Continue Read
పెళ్లి పేరుతో ఓ యువకుడు.. ఏకంగా 50 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. లగ్జరీ కార్లు, బంగ్లాను అద్దెకు తీసుకుని, అవి తనవేనని నమ్మించి, యువతుల నుంచి డబ్బు, బంగారం కాజేశాడు. మ్యాట్రిమోనిలో తన ఫ్రొఫైల్లో బిజినెస్మెన్గా పేర్కొన్న అతడు.. తనను కాంటాక్ట్ అయ్యే యువతులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి వద్ద నుంచి నగదు, నగలతో ఉడాయించేవాడు. విస్తుగొలిపే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరునెల్వేలికి చెందిన 28 ఏళ్ల సూర్య అనే యువకుడు
Continue Read
లండన్లో ఉన్న పెద్ద కుమార్తెను చూడటం కోసం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లగా.. సీబీఐ కోర్టు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు వైఎస్ జగన్కు సూచించింది. నవంబర్ 14వ తేదీలోపు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
Continue Read
తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడిరచారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు.
Continue Read
బిహార్ ఉప-ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లఖిసరై నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. అంతటితో ఆగకుండా, ‘ముర్దాబాద్’ నినాదాలు చేస్తూ కాన్వాయ్ను అడ్డుకున్నారు.
Continue Read
కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తుండగా.. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఈఆర్ ఈశ్వరన్ మాత్రం విచిత్రంగా స్పందించారు. అసలు రాత్రి పూట ఆ అత్యాచార బాధితురాలు బయటకు ఎందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Continue Read
పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్ రోడ్లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు.
Continue Read
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Continue Read