విశాఖపట్నం రైల్వే స్టేషన్కు మహర్దశ
కరూ.500 కోట్లతో పెరగనున్న ప్లాట్ఫారాలు కకేంద్రానికి డీపీఆర్ కమే 2027 నాటికి పూర్తి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.. స్టేషన్ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్ క్లియర్ అయ్యింది. రైల్వే స్టేషన్లో పనులు చేపట్టేందుకు కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించగా.. అక్టోబరు నుంచి పనులు ప్రారంభించనున్నారు. 2027 మే నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని 2022లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను ఆర్ఎల్డీఏకు అప్పగించారు.. అదే ఏడాది జూన్లో బిడ్డర్లతో సమావేశం కూడా నిర్వహించారు. ఈమేరకు అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ఆర్ఎల్డీఏ వివరిం చింది. ఆ తర్వాత ఆగస్టులో రూ.456 కోట్లతో బిడ్డింగ్ ఖరారు అయ్యింది. ప్రధాని నరేంద్రమోదీ మోదు చేతుల మీదుగా నవంబరు 2న వర్చువల్గా శంకుస్థాపన జరిగింది.
రైల్వేస్టేషన్ పనుల్ని 36 నెలల్లో పూర్తి చేయాలని భావించారు.. ఈ ఏడాది నవంబరుకు ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇంతలో కాంట్రాక్టర్కు, ఆర్ఎల్డీఏకు మధ్య కొన్ని సమస్యలు వచ్చాయి.. ఆ వెంటనే పంచాయితీ కోర్టుకు చేరడంతో పనులు ఆగిపోయాయి. ముంబై నుంచి వచ్చిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఈ కోర్టు కేసును పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించారు. అదనపు పనులతో కొత్త డీపీఆర్ తయారు చేసి ఢల్లీికి పంపించారు. అక్కడ ఆమోదం ఆమోదం రాగానే అక్టోబరులో పనులు మొదలు పెట్టి 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముందు రైల్వే స్టేషన్లోని ఎనిమిది ప్లాట్ఫారాలు పదికి పెంచాలని నిర్ణయించారు.
తాజా ప్రతిపాదనల్లో వాటిని 14కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పెంచిన ప్లాట్ఫారాల కోసం జ్ఞానాపురం వైపు చెట్లను తొలగించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు 2027 మే నాటికి పూర్తయిపోతాయనే నమ్మకం ఉందన్నారు విశాఖపట్నం ఎంపీ భరత్. కొత్త కాంట్రాక్టర్ వచ్చారని.. డీపీఆర్కు ఆమోదం వచ్చిన వెంటనే పనులు మొదలవుతాయన్నారు. ఈ పనుల్ని వేగంగా పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ కాంట్రాక్టును ఇచ్చారన్నారు భరత్.