అనంత పద్మనాభ స్వామి కొండపై తాగునీరు సరఫరాకు సహకరించాలి
కదాతలకు పద్మనాభ స్వామి ఆలయ కమిటీ సభ్యుల వినతి
అక్షర కిరణం, (శ్రీముఖలింగం): శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న అనుపురం గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీఅనంత పద్మస్వామి ఆలయానికి తాగునీరు సౌకర్యం కల్పించేందుకు దాతలు సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఈ ఆలయంలో సంక్రాంతి, కనుమ రోజున వైభవంగా జాతర నిర్వహిస్తుంటారని తెలి పారు. స్వామివారిని దర్శనానికి కొండపైకి నిత్యం భక్తులు వస్తుంటారని తెలిపారు. కొండపైకి వెళ్లే భక్తులకి తాగునీరు సమస్య వేధిస్తోందని వివరించారు. కొండపైకి నీరు సర ఫరా చేసేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పా రు. ఆ దాతలకు చేయూతగా శ్రీముఖలింగం గ్రామానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు తమ చేతనైనంత సహాయం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞాప్తి చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి భక్తులకు కొండపైకి తాగునీరు సరఫరాకు ధనరూపంలోగాని వస్తురూపంలో గాని సహాయ సహకారాలు అందించాలని అనంత పద్మనాభ స్వామి ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.