logo
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం కొత్త అప్‌డేట్‌

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్‌ డేట్‌ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు  నిర్ణయించింది.

Continue Read
banner image
సాధారణ వార్తలు

వైఎస్‌ జగన్‌ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో జగన్‌ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్‌ జగన్‌ కాన్వాయి లో ప్రమాదం జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

కాశీబుగ్గలో తీవ్ర విషాదం కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను తక్షణం బ్యాన్‌ చేయాల్సిందే: సర్దార్‌ పటేల్‌ చేసింది అదే

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కువ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ హత్య తరువాత సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్టీయూజీవీ వీసీ సుబ్బారావుకి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సత్కారం

జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌గా నియమితులైన  ఆచార్య వీవీ సుబ్బారావును ఆయన చాంబర్‌లో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

Continue Read
సాధారణ వార్తలు

తుఫాన్‌ ప్రభావిత అంబేద్కర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతమైన డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిశీలనకు వచ్చారు. సీఎం చంద్రబాబుకు తుఫాన్‌కు సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి, తుఫాన్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

Continue Read
సాధారణ వార్తలు

మొంథా తుఫాన్‌ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్‌ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్‌ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Continue Read
సాధారణ వార్తలు

తీరం దాటిన మొంథా తుఫాన్‌ బలహీన పడుతున్న మొంథా

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో మొంథా తుపాను తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుపానుగా కొనసాగుతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుపాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Continue Read