గ్రామ కంఠం ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ పెందుర్తి జోన్ పరిధిలోని 97వ వార్డు పులగవానిపాలెం గ్రామ కంఠం ప్రాంతాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకరరావుతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ కంఠంలో నివసిస్తున్న కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామకంఠంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ తమ ఇళ్లకు ఇప్పటివరకు ఆస్తి పన్నులు లేనందున మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని, తాగునీటి, కొళాయిలు, విద్యుత్ సదుపాయం, రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ, పులగవానిపాలెం గ్రామ కంఠంలో ప్రస్తుతం ఎన్ని ఇళ్లు ఉన్నాయని, ఎన్ని కుటుంబాలు నివసిస్తు న్నారని, వారు ఎప్పటి నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జోనల్ కమిషనర్ ను, డీసీఆర్ను ఆదేశించారు. గ్రామ కంఠానికి సంబంధిం చిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఈ పర్యటనలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.