logo
సాధారణ వార్తలు

అర్ధరాత్రి ఆమె బయటకెందుకు వెళ్లింది :అత్యాచార బాధితురాలిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కోయంబత్తూరులో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈక్రమంలోనే నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ప్రజలంతా డిమాండ్‌ చేస్తుండగా.. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఈఆర్‌ ఈశ్వరన్‌ మాత్రం విచిత్రంగా స్పందించారు. అసలు రాత్రి పూట ఆ అత్యాచార బాధితురాలు బయటకు ఎందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Continue Read
సాధారణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

Continue Read
సాధారణ వార్తలు

లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

: లండన్‌ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Continue Read
సాధారణ వార్తలు

భోగాపురం విమానాశ్రయం కొత్త అప్‌డేట్‌

ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా మారనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు చాలా వరకూ పూర్తయ్యాయి. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మరో కీలక అప్‌ డేట్‌ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 60 కిలోమీటర్ల మేరకు ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనం పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు  నిర్ణయించింది.

Continue Read
banner image
సాధారణ వార్తలు

వైఎస్‌ జగన్‌ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

. పెనమలూరు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో జగన్‌ పర్యటన చేపట్టారు. ఈ పర్యట నలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్‌ జగన్‌ కాన్వాయి లో ప్రమాదం జరిగింది.

Continue Read
సాధారణ వార్తలు

కాశీబుగ్గలో తీవ్ర విషాదం కవిజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట క9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Continue Read
సాధారణ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను తక్షణం బ్యాన్‌ చేయాల్సిందే: సర్దార్‌ పటేల్‌ చేసింది అదే

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ఆరెస్సెస్‌ను బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కువ గా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) కారణమని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ హత్య తరువాత సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు.

Continue Read
సాధారణ వార్తలు

జేఎన్టీయూజీవీ వీసీ సుబ్బారావుకి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన సత్కారం

జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌గా నియమితులైన  ఆచార్య వీవీ సుబ్బారావును ఆయన చాంబర్‌లో ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

Continue Read