ప్రధాని మోదీ తన భార్యకు సిందూర్ ఎందుకు పెట్టడం లేదు
కపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్న
కమోదీ సమాధానం కోసం ప్రజల డిమాండ్
అక్షర కిరణం, (కొల్కతా/జాతీయం): పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలీపుర్దుర్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ చేసిన విమర్శలకు దీదీ గట్టిగా రిప్లై ఇచ్చారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూనే.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటు న్నారని ఆరోపించారు. ఈక్రమంలోనే ప్రధాని మోదీ ఎందుకు ఆయన భార్యకు సిందూర్ పెట్టడం లేదని తీవ్ర ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టిటం తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే మోదీ అలీపుర్దుర్లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడే బెంగాల్ సర్కారుపై విరుచుకుపడగా.. దీదీ తాజాగా స్పందించారు. ఆమె కూడా అంతే గట్టిగా రిప్లై ఇచ్చారు. వెంటనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించ గలరా అంటూ సవాల్ విసిరారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను రాజకీయ లబ్ధికి వినియోగించు కుంటున్నార న్నారు. మహిళలంతా ఎంతో ఇష్టంగా భర్తల నుంచి సిందూ రాన్ని పొందుతారని.. ఆ పేరును ఆర్మీ చేసిన ఆపరేషన్కు పెట్టారన్నారు. కానీ అదే సిందూరాన్ని ప్రధాని మోదీ ఎందు కు ఆయన భార్యకు పెట్టరంటూ గట్టిగా ప్రశ్నించారు. పహల్గాం ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదానికి వ్యతి రేకంగా పోరాడామని పేర్కొన్నారు. తామంతా ఒక్కటే, ఉగ్ర వాదాన్ని సహించేది లేదనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం చాలా బాధాకరం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ బీజేపీ సర్కారును ప్రశ్నించారు.
మోదీ ముందు తనను తాను చాయ్వాలా అని చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత గార్డు అని కూడా అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు సిందూర్ అమ్మడం ప్రారంభిచారన్నారు. సిందూర్ మహిళలకు గర్వకారణం అని ప్రతి మహిళ తన భర్త నుంచి సిందూర్ తీసుకుంటుం దన్నారు. అందుకే సిందూర్ను ఇలా అమ్మకూడదని పేర్కొన్నారు. అంతేకాకుండా మోదీ తన భార్యకు సిందూర్ ఎందుకు పెట్టడం లేదంటూ తీవ్రంగా ప్రశ్నించారు. దీదీ ఈ స్థాయిలో కామెంట్లు చేయగా.. ప్రస్తుతం ఇవన్నీ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మోదీ దీనికి ఏం జవాబు చెబుతారోనని బెంగాల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.