చదువుతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కరాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కవిద్యార్థులకు నగదు పురస్కారాల ప్రదానం
అక్షర కిరణం, (విజయనగరం): చదువు, కుటుంబం, కెరీర్తోపాటు పిల్లలకు మంచి నడవడిక కూడా ముఖ్యమని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం వై జంక్షన్ వద్ద ఎస్ కన్వెషన్లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఆమె మాట్లా డుతూ పిల్లలకు చదువే భవిష్యత్తు అని ఉన్నత లక్ష్యాలను ఏర్పర చుకొని వాటిని సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని చెప్పారు. విద్య విలువ తెలిసిన విద్యా శాఖా మంత్రి లోకేష్ వారిని ప్రోత్సహించడానికే ఈ అవార్డులను, నగదును అందిస్తున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన 158 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేలు చొప్పున చెక్కును, ప్రశంసాపత్రాన్ని, మెడల్ను బహుకరించారు. ఇందులో 106 మంది బాలికలు, 52 మంది బాలురు ఉన్నారు. 93 మంది ప్రభుత్వ సంస్థల నుండి కాగా 65 మంది ప్రైవేటు సంస్థల నుండి ఎంపికయ్యారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ పిల్లలంతా జీవితాంతం షైనింగ్ స్టార్స్గా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతి రాజు మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రీడలు, కల్చరల్ రంగాల్లో కూడా రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈవో మాణిక్యం నాయుడు, డీవీఈవో తవిటి నాయుడు, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి రామా రావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.