జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 68 వినతులు
అక్షరకిరణం, (విశాఖపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ (పీఆర్జీఎస్)కు 68 వినతులు వచ్చాయని జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అదనపు కమిషనరు మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు జీవీఎంసీకి సంబంధించి 68 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. 1వ జోన్కు 1, 2వ జోన్కు 8, 3వ జోన్కు 17, 4వ జోన్ కు 5, 5వ జోన్కు 12, 6వ జోనుకు 15, 7వ జోనుకు 1, 8వ జోన్ కు 3, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 6 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ అకౌంట్సు విభాగమునకు 1, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగమునకు 6, పట్టణ ప్రణాళిక విభాగమునకు 34, ఇంజినీరింగు విభాగమునకు 13, మొక్కల విభాగమునకు 1, యుసిడి విభాగమునకు 04 కలిపి మొత్తంగా 68 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను ప్రతి రోజు పరిశీలిస్తూ, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వీ నరేష్కుమార్, చీప్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు, ఫైనాన్సు అడ్వైజర్ మల్లికాంబ, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్కుమార్, గోవిందరావు, శ్రీనివాసరావు, డీసీపీలు రామమోహన్, హరిదాస్, యూసీడీ పీవో డి.లక్ష్మి, డీపీవోలు ఎంవీడీ ఫణిరామ్, విజయశంకర్, సీవీవో డాక్టర్ ఎన్.కిషోర్, బయాలజిస్ట్ సాంబమూర్తి, స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు, ఆర్.ఎఫ్.ఒ హనుమంతరావు, ఏసీపీలులు రామలింగేశ్వరరెడ్డి, రaాన్సీ లక్ష్మి, శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.
8వ జోన్లో ప్రతి నెల రెండవ బుధవారం బహిరంగ వేలం పాట
జీవీఎంసీ 8వ జోన్లోని షాపు రూములకు ప్రతి నెల రెండవ బుధవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్టు 8వ జోన్ జోనల్ కమిషనర్ హేమావతి ఒక ప్రకటన లో తెలిపారు. 8వ జోన్ (వేపగుంట) పరిధిలో షాపు రూములకు జీవీఎంసీ గజిట్ నోటిఫికేషన్ నెం.07/2025లో షరతులకు లోబడి షాపు రూములను అప్పగించిన తేది నుండి 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు ప్రతి నెల రెండవ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు.
సదరు వేలంపాటలో పాల్గొనే వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 8వ జోనల్ కార్యాలయం పనివేళలో 8వ జోనల్ కార్యాల యం పర్యవేక్షకులను సంప్రదించాలని తెలిపారు.