క్రికెట్ను ప్రోత్సహించిన ఘనత ఉత్తరాంధ్రకు ఉంది
కయూజేఎఫ్ అధ్యక్షుడు వర్మ
కఘనంగా జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): క్రికెట్ క్రీడను ప్రోత్సహించిన ఘనత ఉత్తరాంధ్రకు ఉందని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయులైన సర్ విజ్జు భారతదేశంలో తొలి భారత్ క్రికెట్ జట్టు ఏర్పాటు, తగిన తర్ఫీది ఇవ్వడం, తమ సొంత నిధులతో లండన్ తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. వృత్తి రీత్యా నిరంతరం శ్రమించే జర్నలిస్టుల కోసం ఫ్లడ్ లైట్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ను విశ్వ నాథ ఈవెంట్స్ పోర్ట్ స్టేడియంలో సోమవారం సాయంత్రం ప్రారంభించారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ రచనల్లో, వార్తా కథనాల్లో, ఆటపాటల్లో క్రీడల్లోనూ పాత్రికేయులు రాణిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులను అందించింద న్నారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో పని చేసే జర్నలిస్టులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంటు కోఆర్డినేటర్లు చందు యాదవ్, రవి, రాహుల్, భరత,్ సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్డర్ కిషోర్కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు కే రాము, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు, ఉపాధ్యక్షులు కే.చంద్ర మోహన్, హరనాధ్, పరుశ రామ్, ఈశ్వర రావు, ఈవెంట్ ప్రోత్సాహ కులు జనసేన నేతలు శిలపరశెట్టి శ్రీనివాసరావు, బిల్డర్ బి.గణేష్ కుమార్, ఫ్యూచర్ డెవలపర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.