ఏపీలో విద్యుత్ కోతలపై క్లారిటీ..
కసోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని చెప్పిన అధికారులు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు.. ప్రతి రోజూ 3 గంటల నుంచి 5 గంటల వరకు పవర్ కట్స్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లోడ్ రిలీఫ్ కోసం ప్రభుత్వం ప్రతి రోజూ విద్యుత్ కోతలు విధిస్తోందంటూ కొందరు సోషల్ మీడియా లో ఓ మెసేజ్ను వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లోడ్ రిలీఫ్ పవర్ కట్స్ నేటి నుంచి ప్రారంభం.. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మున్సిపాలిటీల్లో రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు.. నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి వేకువజామున 3 గంటల వరకు పవర్ కట్స్. ఈ పవర్ కట్స్ ఆరోజు విద్యుత్ మిగులును బట్టి 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండొ చ్చు’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంతో.. నిజంగానే ప్రతి రోజూ విద్యుత్ కోతలు తప్పవంటూ జనాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్చెక్ టీమ్ స్పందించింది. ‘ఆంధ్రప్రదేశ్లో ‘లోడ్ రిలీఫ్ పవర్ కట్’ పేరిట ఈరోజు నుంచి రోజుకు 3-5 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోతలు ఉంటాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవ మని.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలారా! ఇలాంటి ఫేక్ వార్తలను ప్రజలెవరూ నమ్మొద్దు’ అంటూ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిం చారు. అంతేకాదు ఇలా ఏవైనా విద్యుత్ కోతలు ఉంటే స్థానికంగా విద్యుత్శాఖ అధికారులు ముందుగానే తెలియ జేస్తారని కూడా గుర్తు చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్లపై విచారణకు ఆదేశాలు
మరోవైపు ఇటీవల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమర్చిన స్మార్ట్ మీటర్లుతో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తుందనే ఆరోపణలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పందించారు. క్షేత్ర స్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరు ఎలా ఉంది? విద్యుత్ చార్జీలు అధికంగా రావడం వాస్తవమా కాదా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తుకు మంత్రి ఆదేశిం చారు. ఈ అంశంపై సమగ్ర నివేదికను తనకు సమర్పించా లని అధికారుల్ని ఆదేశించారు.
‘స్మార్ట్ మీటర్తో బిల్లు ఎక్కువ వస్తున్నాయి అనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనికి గల కారణాలను తెలుసు కోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. స్మార్ట్ మీటర్ల పని తీరుపై కూడా నిశిత పరిశీలన జరుగుతోంది. ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదు’’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.