జమ్మూకాశ్మీర్లో విషాదం
కలోయలో పడిన సీఆర్పీఎఫ్ బస్సు కముగ్గురు జవాన్ల మృతి క15 మందికి తీవ్ర గాయాలు
అక్షర కిరణం, (జమ్మూ కాశ్మీర్/ జాతీయం): జమ్మూ కాశ్మీర్లోని ఉధం పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక బస్సు లోయలో పడిపో వడంతో ముగ్గురు జవాన్లు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 15 మంది కి తీవ్ర గాయాలయ్యాయి. బసంత్గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసు లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గురువారం రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 187వ బెటాలియన్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు బసంత్గఢ్ నుంచి ఒక ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ఇద్దరు జవాన్లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతు ల సంఖ్య మూడుకు చేరుకుంది. మరో 14 మంది తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుం డగా.. ఇందు లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసి, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సైతం స్పందించారు. ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్తో మాట్లాడి.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారని వివరించారు.
ఇలాంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లోని రోడ్లు ఇరుకుగా ఉండటం, వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.