యోగాంధ్ర ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలి
కరాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జూన్ 21న విశాఖ బీచ్ ప్రాంతాల్లో నిర్వహించ నున్న 11వ అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమం ఏర్పాట్లలో ప్రజలకు, యోగా ఔత్సాహికులకు వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ .సురేష్ కుమార్ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి. సంపత్ కుమార్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జీవీఎంసీ అధికారులతో కలిసి ఆర్కే బీచ్ కాళీమాత గుడి వద్ద యోగా ప్రధాన వేదిక, పార్కు హోటల్, తేనేటి పార్కు, సీతకొండ, ఏ వన్ గ్రాండ్, తిమ్మాపురం తదితర పరిసర ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటులను, త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు,పారిశుధ్య పనులు, లైటింగ్ నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ నగరంలో నిర్వహించే అంతర్జాతీ య యోగ దినోత్సవ కార్యక్రమాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. యోగా కార్యక్రమానికి లక్షలా దిమంది ప్రజలు వస్తున్నందున నగరంలో పలుచోట్ల తాత్కాలికంగా నిర్మిస్తున్న మరుగు దొడ్లను పరిశీలించి పనులు ఎంతవరకు పూర్తయ్యాయో అని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదొడ్లలో నిరంతరం సమృద్ధిగా నీరు ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. యోగ కంపార్ట్మెంట్లల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి వాటిలో నిరంతరం నీరు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆయా పాయింట్లకు వద్దకు రాత్రి వస్తున్నందున లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు పారిశుధ్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రతి ప్రాంతంలో అధిక సంఖ్యలో పారిశుధ్య కార్మికులను, అధికంగా అవసరమా కు మరుగుదొడ్లను ఏర్పాటు చేసి నిత్యం పారిశుధ్యం పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు వ్యర్ధాల లేకుండా రోడ్లను, పరిసరాలను పరిశుభ్రపర చాలని అధికారులను ఆదేశించారు. విశాఖ ఖ్యాతి దిశగా యోగా ఆంధ్ర కార్యక్రమాల్లో భాగం గా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్ర మాన్ని జయప్రదం చేసేందుకు అవసరమగో కార్యక్రమాలను జీవీఎంసీ తరఫున ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించా రు. ఈ పర్యటనలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీరులు కృష్ణారావు, కె.వి.ఎన్. రవి తదితరులు పాల్గొన్నారు.