28న 4వ జోన్లో వాణిజ్య సముదాయాల దుకాణాలకు బహిరంగ వేలం పాట
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 4 జోన్లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, మెయిన్ ఆఫీస్ క్యాంటీన్ నకు జూన్ 28వ తేది ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తు న్నట్టు 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయం, జగదాంబ వాణిజ్య సముదాయం, పాత బస్టాండ్ దుకాణాలు, పద్మ నగర్ వాణిజ్య సముదాయం, సూర్యబాగ్ వాణిజ్య సముదా యం, టీఎస్.ఆర్ వాణిజ్య సముదాయం, కనకలదిబ్బ వాణి జ్య సముదాయం, రెల్లివీధి వాణిజ్య సముదాయం, అంగడి దిబ్బ వాణిజ్య సముదాయం లలోని మిగిలిన దుకాణాలకు, జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ క్యాంటీన్, అంబేద్కర్ కళ్యాణ మండపం, రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లను 3 సంవత్స రాల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు ఈనెల 28 తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వ హించనున్నట్టు జోనల్ కమిషనర్ తెలిపారు.
ఈ వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పనివేళలో 4వ జోనల్ కార్యాలయం పర్యవేక్షకులను సంప్రదించాలని జెడ్సీ సూచించారు.