రాష్ట్ర మంత్రులతో కలసి మేయర్ పీలా శ్రీనివాసరావు యోగాభ్యాసాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ వేదికగా జూన్ 21న నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా గురువారం విశాఖ ఆర్కే బీచ్ విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ప్రధాన యోగ వేదిక వద్ద యోగా భ్యాసాలు నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రహదారులు భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ ఎం. తిరుమల కృష్ణబాబు, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేష్ కుమార్, ఆయుష్ సెక్రటరీ రాజేష్ కోటెచా, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్తో కలిసి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు యోగభ్యాసాల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
అనంతరం జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ తో కలిసి యోగా కార్యక్రమాలకు సంబంధించి బీచ్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న విశాఖలో నిర్వహిస్తున్నందున ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు తో పాటు దాదాపు 5 లక్షల మంది యోగ ఔత్సాహికులు, ప్రజలు పాల్గొంటున్నందున నగరంలో పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలుగకుండా అవసరమగు మౌలిక సదుపాయాలు మీ కల్పిస్తూ ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, పబ్లిక్, మొబైల్ టాయిలెట్లు, రోడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ ను ఆదేశించారు. నగరంలో యోగా నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలు సౌకర్యార్థం మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.