విమానం కూలగానే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత.. పక్షులు కూడా తప్పించుకోలేవు..!
అక్షర కిరణం, (అహ్మదాబాద్/జాతీయం): ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తోంది. అయితే విమానం కూలిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీ సెంటీగ్రేడ్కు చేరినట్లు తెలుస్తోంది. ఆ విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో ఈ అగ్ని ప్రమాద తీవ్ర భారీగా ఉందని అధికారులు వెల్లడిరచారు. ఇంతటి భారీ ఉష్ణోగ్రత ఉంటే కనీసం ప్రమాదం జరిగినపుడు పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేవని చెబుతున్నారు. అలాంటిది ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అద్భుతమేనని పేర్కొంటున్నారు.
భారతదేశ చరిత్రలోనే ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై అధికారులు, ఎయిర్లైన్స్ యాజ మాన్యం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినపుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొ న్నాయో ఊహిస్తేనే.. తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతు న్నాయి. ఇక విమానం అప్పుడే టేకాఫ్ అవుతుండటంతో అందులో భారీగా ఇంధనం నింపి ఉంచారు. దాదాపు 1.25 లక్షల లీటర్ల ఇంధనాన్ని విమానంలో నింపడంతో.. అది కూలిపోయిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగేందుకు ఆ ఇంధనం తోడ్పడిరది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉష్ణోగ్రత వెయ్యి డిగ్రీ సెంటీగ్రేడ్కు చేరినట్లు వెల్లడిరచారు.
అయితే అత్యంత తీవ్రమైన వేడి కారణంగా ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా భారీగా అగ్నికీలలు ఎగిసిపడి.. ఎవరినీ రక్షించేందుకు వీలు లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియా సమావేశంలో వెల్లడిరచారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోగా.. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు.
విమాన ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని గుజరాత్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) అధికారి ఒకరు వెల్లడిరచారు. అంతకుముందు.. స్థానికులు కొంతమందిని సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. కానీ తమ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఎవరూ సజీవంగా లభించలేదని చెప్పారు. విమానం కూలిపోవడం వల్ల ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో క్షణాల్లోనే అక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు పెరిగిందని ఒక సీనియర్ అగ్నిమాపక అధి కారి తెలిపారు. దీనివల్ల ప్రమాదం నుంచి ఎవరూ తప్పించు కునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రమాదం జంతువులకు, పక్షులకు కూడా తప్పించుకోవడానికి సమ యం ఇవ్వలేదని పేర్కొన్నారు. స్థానిక ఇళ్లల్లో ఉండే కుక్కలు, పక్షులు చనిపోయి ఉన్నట్లు ఆయన తెలిపారు.