శబరిమలలో యాత్రికుల కోసం ప్రత్యేక పోలీసుల వెబ్సైట్
అక్షర కిరణం, (శబరిమల/జాతీయం): కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయా నికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల మకరు విళక్కు పూజలు కోసం నవంబరు 16న ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. వేలాదిగా భక్తులు ఇరుముడితో వచ్చిన స్వామిని దర్శించుకుంటున్నారు. ఈక్రమంలో భక్తులకు దర్శనం మరింత సాఫీగా సాగేందుకు కేరళ పోలీసులు ప్రత్యేకంగా ఓ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘శబరిమల-పోలీస్ గైడ్’ పేరుతో పత్తనంథిట్టా జిల్లా పోలీస్ యంత్రాంగం సైబర్ విభాగం పోర్టల్ను రూపొందించింది. జిల్లా ఎస్పీ వీజీ వినోద్ కుమార్ సూచనలతో రూపొందిం చిన పోర్టల్ను గురువారం నుంచి అందుబాటులోకి తీసు కొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈపోర్టల్లోని సమా చారం ద్వారా భక్తులు మరింత త్వరగా స్వామి దర్శనం చేసుకోడానికి వీలు కలుగుతుందని అన్నారు.
శబరిమల యాత్రికులకు ఈపోర్టల్ ఎంతో ఉపయుక్తం గా ఉంటుందని, సమయానుసారంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎస్పీ వినోద్ తెలిపారు. పోర్టల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే...శబరిమలలో ఏం చేయాలి? ఏం చేయకూడదు, పాటించాల్సిన నిబంధనలు సహా సంబం ధించి యాత్రికులకు అవసరమైన ముఖ్య సమాచారం ఇంగ్లిష్లో ఉంటుందని చెప్పారు. పోలీస్ హెల్ప్లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్లు, ఆరోగ్య విభాగం, కేరళ ఆర్టీసీ, అంబులెన్స్, అగ్నిమాపక విభాగం, ఆహారభద్రత, దేవస్థానం బోర్డు ఆఫీసులకు సంబంధించిన మొబైల్, ఫోన్నంబర్లు వెబ్సైట్ లో ఉంటాయి. శబరిమల పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర, ఆలయంలో జరిగే వివిధ వేడుకలు, ఇరుముడితో పాటు వాహనాలు పార్కింగ్ స్థలాలు, శబరిమలకు (రైలు, వాయు, రహదారి) రూట్లు, దర్శనాలకు వెళ్లే మార్గాల గురించి పూర్తి సమాచారం ఇందులో ఉంటుందని ఎస్పీ వెల్లడిరచారు. పదునెట్టాంబడి, మాలికా పురత్తమ్మ ఆల యం, అజి, అప్పం, అరవణ పాయసం ప్రసాదం కౌంటర్లు ఉన్న ప్రదేశాల గురించి గూగుల్ మ్యాప్తో సహా ‘శబరి మల- పోలీస్ గైడ్’లో ఉన్నాయని ఆయన వివరించారు. దీంతోపాటు శబరిమలలో వాతావరణ పరిస్థితుల గురిం చి కూడా సమాచారం అందజేస్తోంది. ఈ ఏడాది రోజూ 80 వేల మంది భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. వర్చువల్ క్యూలైన్ కోసం 70 వేలు, స్పాట్ బుకింగ్తో 10 వేల టోకెన్లు రోజూ జారీ చేస్తోంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. మరోవైపు, కేరళ ప్రభుత్వం, టీడీబీ సమన్వయంతో పనిచేస్తున్నాయి. గతేడాది సరైన ఏర్పాట్లు చేయలేదనే విమ ర్శలు వచ్చాయి. భక్తుల రాకను అంచనా వేయడంలో విఫ లం కావడంతో చాలామంది స్వామిదర్శనం లేకుండానే వెనుదిరిగారు. ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టారు.