సారీ చెబితే సరిపోదు.. రాజీనామా చేయండి
మణిపూర్ సీఎంకు సీపీఐ డిమాండ్
అక్షర కిరణం, (మణిపూర్/జాతీయం): మణిపూర్లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే రెండ్రోజుల క్రితమే దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే తాము ఈ క్షమాపణను స్వీకరించ బోమని సీపీఐ తేల్చి చెప్పింది. ముఖ్యంగా తమకు కావాల్సింది సీఎం క్షమాపణలు మాత్రమే కాదని.. రాష్ట్రంలో శాంతి భద్రతల అమలు అని వివరించింది. వీలయినంత తొందరగా సీఎం బిరేన్ సింగ్ తన తప్పును ఒప్పుకుని పదవికి రాజీనామా చేయాలని కోరింది.
గతేడాది మణిపూర్లో జరిగిన అల్లర్లు, హింసా కాండ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలిసిందే. అయితే రెండ్రోజుల కిందట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గతాన్ని మర్చిపోయి ప్రజలు తనను క్షమించాలని కోరారు. 2024 దురదృష్టకర సంవత్సరంగా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీపీఐ.. సీఎం క్షమాపణలను ఖండిస్తున్నట్లు వివరించింది. అయినా తమకు కావాల్సింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్షమాపణలు కాదని.. రాజీనామా అంటూ చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం. 2023వ సంవత్సరం మే 3వ తేదీ నుంచి కుకీ, మైతేయిల మధ్య ఘర్షణలు చెలరేగగా.. ఈ హింసాకాండలో మొత్తం 200 మందికి పైగా చనిపోయా రు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పోలీసుల వద్ద నుంచి నిరసనకారులు పెద్ద ఎత్తున ఆయుధాలను దోచుకున్నారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్.. రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై స్పందించారు. గతంలో జరిగిన అన్నింటినీ మర్చిపోయి ప్రజలు తనను క్షమించాలని కోరారు.
ఇంఫాల్లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హింసాకాండను నిర్వహించడంపై ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు. 2024వ సంవత్సరం చాలా దురదృష్టకరంగా గడిచింద న్నారు. ఈ హింసాకాండ వల్ల అనేక మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని, మరికొందరు తమ ఇళ్లు వదిలిపెట్టి మరీ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనంతటికీ తాను చింతిస్తున్నట్లు గతేడాది డిసెంబర్ 31వ తేదీ రోజు వివరించారు. అయితే తాజాగా దీనిపై సీపీఐ స్పందించింది. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చెప్పిన క్షమాపణలను తాము ఖండిస్తున్నట్లు వివరించింది. తమకు కావాల్సింది క్షమాపణలు కాదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలను కట్టడి చేయలేకపోయిన సీఎం.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి చేతగాని తనం వల్లే 200 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది నిరాశ్రయులు అయ్యారని వెల్లడిరచింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తించి.. అందరి ముందు ఒప్పుకోవాలని కోరింది. ఆ తర్వాతే సీఎం బిరేన్ సింగ్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరింది.