భారత్లో కొత్త రకం బ్లడ్ గ్రూప్ గుర్తింపు
కబెంగళూరు మహిళలో గుర్తించిన వైద్యులు కక్రిబ్ గ్రూప్గా నామకరణం
అక్షర కిరణం, (బెంగళూరు/ జాతీయం): ప్రపంచ వైద్య చరిత్రలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళలో అత్యంత అరుదైన, ఇంతవరకు గుర్తించబడని కొత్త రక్త వర్గం ‘క్రిబ్’ (జRIదీ)ను భారతీయ వైద్య నిపుణులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ‘క్రిబ్’ రక్త వర్గాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచంలో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారని అంచనా వేస్తుండగా.. అందులో ఒకరు భారత్లోనే ఉండడం గమనార్హంగా నిలుస్తోంది.
బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన 36 ఏళ్ల మహిళలో ఈ అరుదైన రక్తవర్గాన్ని గుర్తించారు. ఆమె రక్తాన్ని విశ్లేషించినప్పుడు.. సాధారణంగా కనిపించే A, దీ, Aదీ, ూ రక్త వర్గాలతోపాటు Rష్ట్ర పాజిటివ్/నెగటివ్ వర్గీకరణలకు భిన్నంగా.. ప్రత్యేకమైన యాంటీజెన్లు, యాంటీబాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కానీ అది ఏ వర్గానికి చెందినదో తెలియక తెగ ఇబ్బంది పడిపోయారు. ఈక్రమంలోనే ఆమె కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రికి పిలిపించారు. మొత్తంగా 20 మందికి రక్త పరీక్షలు చేశారు.
వారందరి వర్గాలు సాధారణమైనవే కావడంతో.. ఏం చేయాలో పాలుపోక సదరు మహిళ రక్తాన్ని లోతైన పరిశోధనలు నిమిత్తం బ్రిటన్లోని బ్రిస్టల్లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ల్యాబ్ 10 నెలల పాటు ఆమె రక్తంపై అధ్యయనం చేసింది. క్రోమర్ సిస్టమ్లో ఓ కొత్త యాంటీజెన్ పదార్థం ఉన్నట్టు గుర్తించింది. ఈక్రమం లోనే క్రోమర్, బెంగరూళురు పదాలను కలుపుతూ.. ఈ రక్తానికి జRIదీ(క్రిబ్)గా నామకరణం చేశారు. అలాగే ఇందుకు సంబంధించిన అనేక విషయాల గురించి వివరించారు.
‘క్రిబ్’ రక్త వర్గాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో కొన్ని ప్రత్యేక రకాల యాంటీబాడీలు ఉంటాయని నిపుణులు తెలిపారు. ఇవి ఇతర సాధారణ రక్త వర్గాలకు చెందిన రక్తాన్ని స్వీకరించడానికి అడ్డుపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్త మార్పిడి అవసరమైనప్పుడు ఇది పెద్ద సవాలును విసిరే అవకాశం ఉందన్నారు. ఈ కొత్త రక్తవర్గం ఆవిష్కరణ రక్తం యొక్క జన్యుశాస్త్రం, వివిధ రక్తవర్గాల మధ్య సంబంధాలపై మరింత లోతైన అధ్యయనాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు.
ఈ ఆవిష్కరణకు ముందు ప్రపంచంలో అత్యంత అరుదైన రక్త వర్గాలలో ‘బొంబాయి బ్లడ్ గ్రూప్’ ఒకటిగా పరిగణించబడేది. ఇప్పుడు ‘క్రిబ్’ కూడా ఆ జాబితాలో చేరింది. ఇలాంటి అరుదైన రక్తవర్గాలను గుర్తించడం వల్ల రక్త మార్పిడి ప్రక్రియలను మెరుగు పరచడానికి, నిర్దిష్ట ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులకు సరైన చికిత్స అందించడానికి వీలు కల్గుతుంది. ఈ ఆవిష్కరణ భారత వైద్య పరిశోధనల సామర్థ్యాన్ని మరోసారి చాటింది.