పారమ్మవారిని దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం (సాలూరు): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలూరు పట్టణానికి సమీపంలోఉన్న శ్రీపారమ్మ కొండపై వెలసిన శ్రీపార్వతీ పరమేశ్వరుల, అమ్మవారిని, స్త్రీశిశుసంక్షేమం గిరిజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీపారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పరమ శివుడి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాలు సుఖసంతోషా లతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు. శ్రీపారమ్మ కొండ శివాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి మౌనవ్రతం పాటించి శివార్చన నిర్వహించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శివుని ఆరాధనలో భాగస్వాములయ్యారు.