నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను రప్పించే ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్ష
కప్రజల కోసం ఖట్మాండుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
కఆయా విమానాశ్రయాలకు వెళ్లి ప్రజలకు స్వాగతం పలకాలని ఎమ్మెల్యేలకు లోకేష్ ఆదేశం
అక్షర కిరణం, (అమరావతి): నేపాల్ లో చిక్కుకున్న ఏపీ నివాసితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు రావడంపై ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఖాట్మండుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం చేరుకుంది. ఖాట్మండు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ ప్రజలు పత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర ప్రజలకు స్వాగతం పలకాలని కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మంత్రి లోకేష్ ఆదేశించారు
విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ఏపీ ప్రజలను స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను మంత్రి లోకేష్ సంకీర్ణ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఇందుకోసం వాహనాలు, ఇతర సౌకర్యాలు కల్పించా లని మంత్రి లోకేష్ ఆదేశించారు.