అభయ`మీ భద్రత మా బాధ్యత ప్రారంభించిన ీVAంమంత్రి అనిత
అక్షర కిరణం, (అనకాపల్లి): అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ`మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమాన్ని ీVAం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అభయా` మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రతి పాఠశాల, కళాశాలలో అభయ ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసి, మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే 112కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరికీ సూచించారు. మహిళల భద్రతకు ఎలాంటి రాజీ లేదు. ప్రతి మహిళ ధైర్యంగా జీవించే సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ీVAం మంత్రి అనిత పేర్నొన్నారు.