తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడ
అక్షర కిరణం, (తిరుమల): శ్రీవారి భక్తులకు తిరు మల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. భక్తుల కు అందించే అన్నప్రసాదాలు మరింత రుచికరంగా ఉండే లా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదం మెనూలో మరో ఐటమ్ పెంచాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన బోర్డు సమా వేశంలో టీటీడీ చైౖర్మన్ బీఆర్ నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా అన్న ప్రసాదం మెనూలో మార్పులు చేయనున్నారు. అన్నప్రసాదం మెనూ లోకి మసాలా వడలను చేర్చారు. ప్రస్తుతం ఇది ట్రయల్ రన్ మాత్రమే. సోమవారం ఐదు వేల మసాలా వడలను భక్తుల కు వడ్డించారు. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా వీటిని తయారు చేయించారు. మసాలా వడల రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పరి శీలనలో లోటుపాట్లను సరిచేసుకొని త్వరలోనే పూర్తిస్థా యిలో అన్నప్రసాదం మెనూలోకి మసాలా వడలు చేర్చనున్నారు.