జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలంటూ ఎన్ఆర్ఐలకు ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపు
అక్షర కిరణం, (పొందూరు): శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలను స్థాపించాలని అమెరికాలోని ఎన్ఆర్ఐలను పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆహ్వానించారు. అమెరికాలో పర్యటిస్తున్న రవి కుమార్ అమెరికాలో పలువురు తెలుగు పారిశ్రామికవేత్తల ను కలిసారు. శ్రీకాకుళం జిల్లాలో నీరు, విద్యుత్, పారిశ్రమల స్థాపనకు అనువువైన భూములు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సీ పోర్టులు, జాతీయ రహ దారులు అందుబాటులో ఉండగా త్వరలో విమానాశ్రయం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. కూటమి ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ నైపుణ్యం కలిగిన యువతను పరిశ్రమలకు అందిస్తోందన్నారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలు శ్రీకాకుళం జిల్లాలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. తన ఆహ్వానానికి పలువురు సానుకూలంగా స్పందించినట్లు రవికుమార్ తెలిపారు.