విజయనగరం రైల్వేస్టేషన్లో తనిఖీలు
అక్షర కిరణం, (విజయనగరం): విశాఖపట్నం డిప్యూటీ సూపరిం టెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ లైన్స్ సర్కిల్ పర్యవేక్షణలో విజయనగరం రైల్వే ఎస్ఐ వి.బాలాజీ రావు, ఆర్పీఎఫ్ సీఐ ఆర్.కుమార్రావు, ఆధ్వర్యంలో 30 మంది సిబ్బందితో కలిసి ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంట వరకు విజయనగరం రైల్వే స్టేషన్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్) ఆర్పీఎఫ్ (రౖౖెల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. మొత్తం సిబ్బంధి మూడు బృందాలుగా ఏర్పాడి తనిఖీలు చేశారు. ప్రతి బృందానికి ఆర్పీ ఎస్ఐ, ఆర్పీఎఫ్ సీఐ నాయకత్వం వహించారు. విజయనగరం రైల్వే స్టేషన్లోని అన్ని వేయిటింగ్ హాళ్లు, క్లోక్ రూము లు, పార్శిల్ కార్యాలయం, అన్ని ప్లాట్ఫారంలను తనిఖీ చేశారు. వీటితోపాటు సమత ఎక్స్ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం వందే భారత ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ - బెంగళూరు ప్రసాంతి ఎక్స్ప్రెస్, గుంటూరు -రాయగడ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు సురక్షితంగా, మాదక ద్రవ్యాల రవాణా లేకుండా ప్రభుత్వం, రైల్వే పోలీసు నిరంతర భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఐ.వాణి
అక్షర కిరణం, (విశాఖపట్నం): కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఇసుకపల్లి వాణి నియమితుల య్యారు. ఆంధ్ర వైద్య కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆమెను కేజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ఇసుకపల్లి వాణి 1985లో ఆంధ్ర వైద్య కళాశాలలోనే ఎంబీబీఎస్, తరువాత 1992 నుంచి 95 వరకు ఎండీ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను కేజీహెచ్లో అభ్యసించారు. 1993 నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసులో చేరి చింతపల్లి, ఏలేశ్వరం, వంటి గిరిజన ప్రాంతాల్లోను, తరువాత సామర్లకోటలోను వైద్య అధికారిగా పని చేశారు. 1997 నుంచి ఆంధ్ర వైద్య కళాశాలతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్గా ఆ తరువాత ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 నుంచి గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పని చేశారు. ఇటీవలే ప్రసూతి స్త్రీల విభాగానికి ఆచార్యులుగా విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్లలో ఏడీఎంగా పదోన్నతి పొందారు. కాగా ఇసుకపల్లి వాణిని కేజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ తాను చదువుకున్న కళాశాలలో ప్రొఫెసర్గా, విభాగాధిపతిగా పని చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇప్పుడు ఎంతో కీలకమైన కేజీహెచ్ సూపరింటెం డెంట్ పదవిలో తనను ప్రభుత్వం నియమించడంపై సంతోషంగా ఉందన్నారు. తనపై ప్రభుత్వం ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానన్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించి కేజీహెచ్ ఖ్యాతిని ఇనుమడిరప చేస్తానని పేర్కొన్నారు.