విశాఖలో ఉద్యోగాల పేరుతో ఐటీ కంపెనీ మోసం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. మధురవాడ లో వారుష్ ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని.. అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలే దన్నారు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పీఎం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈవోపై ఫిర్యాదు చేశారు. ఈ వారుష్ కంపెనీని మధురవాడలోలని మిదిలాపురి ఉడా కాలనీలో 2024లో ప్రారంభించారని.. ఉద్యోగాల పేరుతో ఆ కంపెనీ సీఈవో వంకాయల సాయికుమార్ లక్షల్లో దోచు కున్నారని ఆరోపించారు. తమకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో రోడ్డునపడ్డామంటున్నారు. త్వరలోనే తాము ఐటీ మంత్రి నారా లోకేష్ను కలుస్తామంటున్నారు బాధిత ఉద్యోగులు.
తామంతా వారుష్ టెక్నాలజీలో ఉద్యోగాలు చేస్తున్నామని.. ఆ కంపెనీ వంకాయల సాయి కుమార్ అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు ఉద్యోగులు. తాము ఉద్యోగాల్లో చేరిన సమయంలో తమ దగ్గర నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారని.. మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తామని తమతో చెప్పారంటున్నారు. అయితే మూడు నెలలు జీతాలు (స్టైఫండ్) చెల్లించారన్నారు. ఆ తర్వాత నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనవరి నుంచి మే నెల వరకు జీతాలు ఇవ్వలేదని.. అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లా డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉద్యోగంలో చేరిన కొత్తలో 150మంది ఉంటే.. ఇప్పుడు 20మంది మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సీఈవోతో చెబితే.. ‘నాపై 10 కేసులు ఉన్నాయి.. మరో కేసు అవుతుంది అంతేకదా’ అని సాయికుమార్ తమతో అన్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం తాము ముగ్గురం మాత్రమే ఫిర్యాదు చేశామన్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో కూడా వీ ఇన్ఫో టెక్ కంపెనీ పేరుతో ఇదే తరహాలో మోసం జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు కూడా పోలీపులు కేసు నమోదు చేశారు. అయితే బాధితులకు డబ్బులు చెల్లిస్తానని కంపెనీ సీఈవో హామీ ఇచ్చారట. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మోసం జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఓ వైపు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి.. ఇలాంటి తరుణంలో ఇలా ఐటీ కంపెనీల పేరుతో మోసం చేయడం కలకలం రేపింది. నగరం ఐటీ హబ్గా ఎదుగుతున్న సమయంలో నిరుద్యో గులు మాయగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు.. కొన్ని బోగస్ ఐటీ కంపెనీలు నిరుద్యోగుల్ని ముంచేస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారుష్ ఐటీ కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.