అంతరిక్ష కార్యక్రమానికి గేమ్ఛేంజర్గా ఇస్రో జంబో రాకెట్
అక్షర కిరణం, (హైదరాబాద్/జాతీయం): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ భవిష్యత్తును మార్చ బోయే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఎత్తుతో భారీ రాకెట్ను నిర్మించే పనిలో ఉన్నట్లు ఆ సంస్థ చైర్మన్ వి. నారాయణన్ వెల్లడిర చారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ స్నాత కోత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఆయన ఈ విషయాలను వెల్లడిరచారు. 35 కిలోల పేలోడ్తో మొదలు పెట్టిన భార తీయ అంతరిక్ష ప్రయాణం.. ఇప్పుడు 75,000 కిలోల బరు వైన ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి తీసుకెళ్ల గలిగే ఒక మెగా రాకెట్ను తయారు చేసే స్థాయికి ఎదిగిం దన్నారు. ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదని అన్నారు. వ్యూహాత్మకంగా, ఆర్థికం గా కూడా దేశానికి ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తుం దని స్పష్టం చేశారు. దాదాపు 40 అంతస్తుల ఎత్తు ఉండే ఈ రాకెట్.. ఇస్రో హెవీ-లిఫ్ట్ ప్రయోగాలకు వెన్నెముకగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. దీని సామర్థ్యం భారత మానవ అంతరిక్షయాన కార్యక్రమం ‘గగన్యాన్’కు.. అలాగే లోతైన అంతరిక్ష పరిశోధనలకు, చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్ మిషన్లకు ఒక కొత్త ఊపునిస్తుందని చెప్పారు. ఇది ఏకంగా అంతరిక్ష స్టేషన్ మాడ్యూళ్లను, పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక ‘గేమ్-ఛేంజర్’గా మారబో తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్-హెవీ లాంచ్ వెహికిల్స్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ చేరడం ద్వారా.. అంతర్జాతీయ అంతరిక్ష యానంలో మన స్థానం మరింత పదిలం అవుతుంది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్కు కక్ష్యలో55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3, మంగళ్యాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైన అంశంగా మారనుంది.