రాజస్థాన్లో కలకలం రేపిన నరబలి ఘటన
కగోడవలతో పుట్టింటికెళ్లిపోయిన భార్య కోసం మేనల్లుడిని బలిచ్చిన మనోజ్
కమాంత్రికుడి సలహాతో ఆరేళ్ల మేనల్లుడిని బలిచ్చిన మనోజ్ కదేశంలో పెరిగిన మూఢనమ్మకాలు
అక్షర కిరణం, (రాజస్థాన్/జాతీయం): గత పదకొండేళ్లుగా దేశంలో మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చేందుకు ఓ మాంత్రికుడిచ్చిన సలహాతో అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తాంత్రికుడి ఆదేశాలతో చిన్నారిని నరబలి ఇచ్చిన ఈ ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది. తనతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు తాంత్రిక పద్ధతులు అవలంబించాలని నమ్మిన మానవ మృగం.. అభంశుభం తెలియని అరేళ్ల బాలుడైన తన మేనల్లుడ్ని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
ఈ అమానవీయ ఘటన అల్వార్ జిల్లా సారై కళాన్ గ్రామంలో జులై 19న జరిగింది. వివరాల్లోకి వెళ్తే... లోకేశ్ అనే ఆరేళ్ల బాలుడు ఆ రోజు సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి ఆ చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో గడ్డివాము మధ్య బాలుడు మృతదేహం లభించింది. గొంతు కోసి హత్య చేసినట్టు స్పష్టం కాగా, శరీరంపై అనేక సిరంజీల గాట్లు కూడా కనిపించాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసుల విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో లోకేశ్ మేనమామ మనోజ్ కుమార్ ప్రవర్తన తేడాగా ఉండడంతో అనుమానించారు. లోకేశ్ కనిపించకుండ పోయినప్పుడు మొదట తాను కూడా వెతుకుతున్నట్టుగా నటించాడు. అయితే, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారించగా చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు. మనోజ్, అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలన్న ఆశతో సునీల్ కుమార్ అనే మాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి ఇస్తే ఆమె తిరిగొస్తుందని మాంత్రికుడు సలహా ఇచ్చాడు. పూజలు కోసం రూ.12,000 నగదు, ఒక చిన్నారి రక్తం, కాలేయాన్ని బలి ఇవ్వాని చెప్పాడు. అందుకు అంగీకరించిన మనోజ్.. జులై 19న మధ్యాహ్నం లోకేశ్కు చాక్లెట్ ఆశచూపి ఊరు చివర పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతునులిమి హత్య చేసి, సిరంజీలతో రక్తం తీసే ప్రయత్నం చేశాడు. అనంతరం శవాన్ని గడ్డి వాము మధ్య దాచి పెట్టాడు. ఆ చిన్నారి కడుపు కోసం కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసుల తెలిపారు.
ఈ ఉదంతంపై తొలుత పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్ పై అనుమానంతో మరింతగా విచారించారు. విచారణలో అతడు విస్తుపోయే వాస్తవాలు బయటపెట్టాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాంత్రికుడు సునీల్ను మంగళవారం అరెస్ట్ చేశారు. మరికొన్ని నరబలి కేసుల్లో ఇతడి ప్రమేయం ఉందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని సీజ్ చేసిన పోలీసులు, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. నిందితుడు ఉపయోగించిన సిరంజీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.