న్యూస్పేపర్ ఆఫీసులో భారీ ఆయుధాలు..
అక్షర కిరణం, (కశ్మీర్/ జాతీయం): ఢల్లీి పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రనెట్వర్క్ను కూడా ఛేదించే పనిలో ఉన్నారు అధికారులు. కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వైద్యుడు ఉమర్ నబీ జమ్మూకాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వాడు కావడంతో.. అక్కడి పోలీసులు కూడా ఉగ్ర నెట్వర్క్పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురువారం జమ్మూలోని ‘ది కాశ్మీర్ టైమ్స్’ న్యూస్పేపర్ కార్యాల యంపై దాడి చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహి స్తోందనే ఆరోపణలతో ఈ దినపత్రిక కార్యాలయంపై దాడి చేశారు పోలీసులు.
భారీ ఆయుధాలు లభ్యం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ది కాశ్మీర్ టైమ్స్ న్యూస్పేపర్లో చేపట్టిన సోదాల్లో.. ఏకే-47 కాట్రిడ్జ్లు, కొన్ని పిస్టల్ రౌండ్లు, మూడు గ్రెనేడ్ లివర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ది కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అను రాధ భాసిన్పై కేసు నమోదు చేశారు. దేశంపై అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటు వాదాన్ని కీర్తించడం.. దేశంతో పాటు జమ్మూకాశ్మీర్ సార్వ భౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగించే విధంగా కథనాలు ప్రచురిస్తోందని పోలీసులు ఆరోపించారు. కాగా, ది కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్ కు.. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మమ్మల్ని సైలెన్స్ చేయలేరు..
ఈ దాడులపై ది కాశ్మీర్ టైమ్స్ పత్రిక స్పందించింది. తమను సైలెన్స్ చేయడానికి ఇది మరో ప్రయత్నం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘‘మా కార్యాలయంపై దాడులు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది అనే ఆరోపణలు నిరాధారమైనవి. ఇది కాశ్మీర్ టైమ్స్ను అణిచివేయడానికి, సైలెన్స్ చేయడానికి చేసిన మరొక ప్రయత్నం. ప్రభుత్వాన్ని విమర్శిం చడం దేశ వ్యతిరేక చర్య కాదు. నిజానికి.. దానికి పూర్తిగా వ్యతిరేకమైన చర్య. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి.. బలమైన, ప్రశ్నించే పత్రికా యంత్రాంగం అవసరం. అధికార యంత్రాంగా న్ని జవాబుదారీగా ఉంచడం, అవినీతిని ప్రశ్నిం చడం, అణగారిన వర్గాల గొంతుకలు అవడం.. వంటివి మన దేశాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. ఇలా చేస్తే దేశం బలహీన పడదు’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. జర్నలిజం నేరం కాదు..
జర్నలిజం నేరం కాదని ది కాశ్మీర్ టైమ్స్ పేర్కొంది. జవాబుదారీతనం రాజద్రోహం కాదని.. తమపై ఆధారపడిన వారికి.. సమాచారం అందించడం, దర్యాప్తు చేయడం, వారి తరపున వాదించడం కొనసాగిస్తామని తెలిపింది. కాగా, రాష్ట్ర పోలీసు దర్యాప్తు సంస్థ చేస్తున్న దాడులపై ఉప ముఖ్యమంత్రి సురిందర్ సింగ్ చౌదరి స్పందించారు. ఈ దాడులు మీడియాపై ఒత్తిడి పెంచడానికి కాదని పేర్కొన్నారు. కేవలం తప్పుడు పనులకు పాల్పడిన వారిపైనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.