మద్యం మత్తులో హడలెత్తించాడు
మత్తులో ఏకంగా విద్యుత్ వైర్లపైనే పడుకున్న మందుబాబు హడలెత్తిపోయిన ప్రజలు
తల్లి మద్యానికి డబ్బులివ్వలేదనే కోపంతో పడుకున్నాని చెప్పిన మందుబాబు
అక్షర కిరణం, (పాలకొండ): మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ వ్యక్తి అందర్నీ హడలెటత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కి వైర్లపై పడ్డుకున్నాడు.. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్శాఖ అధికారులకు చెప్పి ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. అందరూ కిందకు దిగమని చెప్పినా వినలేదు.. కొద్దిసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లపై ఎందుకు పడుకున్నావని అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. ఫుల్గా మందు కొట్టాడు.. ఆ కిక్కులో నేరుగా వెళ్లి స్తంభం ఎక్కి వెళ్లి విద్యుత్ వైర్లపై పడు కున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అవాక్కయ్యారు. పాలకొండ మండలం ఎం సింగిపురంకు చెందిన యజ్జల వెంకన్నకు మద్యం అలవాటు ఉంది. లిక్కర్ షాపుకెళ్లి ఫుల్గా తాగేశాడు.. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా ఓ విద్యుత్ స్తంభం దగ్గరకు వెళ్లాడు. మద్యం కిక్కులో వెంకన్న ఆ స్తంభాన్ని ఎక్కేసి పైన విద్యుత్ వైర్లపై పడుకున్నాడు. గమనించిన స్థానికులు షాకయ్యారు.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కిందకు దిగమని వెంకన్నకు నచ్చజెప్పారు. తాను మాత్రం కిందకు దిగనని మొండికేశాడు. కొద్దిసేపు స్థానికులు బతిమాలడంతో కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకీ వెంకన్న విద్యుత్ వైర్లపై పడుకోవడా నికికారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంకన్న మద్యం తాగి ఇంటికి వెళ్లాడట. మళ్లీ మందు కోసం డబ్బులివ్వమని తల్లిని అడిగాడట.. ఆమె నిరాకరించడంతో ఆ కోపంలో వెళ్లి విద్యుత్ వైర్లపై పడుకున్నట్లు చెబుతున్నారు. అయితే వెంకన్న వైర్లపై పడుకున్న సమయంలో కరెంట్ లేకపోవడం.. ఆ వెంటనే విద్యుత్ సరఫరా కాకుండా నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకున్నారు.