ఘనంగా శ్రీశ్యామలాంబ అమ్మవారి తోలేళ్ల సంబరాలు
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు గ్రామదేవత ఆరాధ్య దైవం శ్రీశ్యామలాంబ అమ్మవారి పండుగ తోలేళ్ళు ఉత్సవాలను, సాలూరు పట్టణ జమీందారు అనువంశిక ధర్మకర్త విక్రమ్ చంద్ర సన్యాసిరాజు. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. శ్యామలాంబ అమ్మ వారి తొలి ఉత్సవాలను సాలూరు పట్టణమంతా ప్రజలంతా తరలిరావడంతో భక్తులు తాకిడి వేలసంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఊరంతా పండుగ వాతావరణం కనిపించింది. తొలి సంబరాలు సందడిగా మారింది. ఘటాలను అమ్మ వారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తోలేళ్ళు ఉత్సవాల్లో భాగంగా ముందుగా సాలూరు పట్టణ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి, తొలెళ్ళు సంబరాలను సాలూరు పట్టణ పెద్దకోమటిపేట గద్దె వద్దకు సంప్రదాయ బద్ధంగా ధాన్యం బుట్టను గెద్దకు తీసుకురాగా, తదనంతరం పసుపుపూజతో తాళ్లతో తిరగడం ప్రారంభించడానికి ముందుగా అక్యనవీది, అల్లువీధి, గొల్లవీధి, డబ్బివీథి, మెంటాడవీధిల్లో తిప్పుతూ భక్తులను అలరించాయి. సంప్రదాయబద్ధంగా తొలేళ్ళు ఉత్సవాలు ముగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బంజ్దేవ్, సాలూరు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సీబీఎస్ఈ టాపర్లకు సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, టాటా క్లాస్ ఎడ్జ్ సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు టాటా క్లాస్ ఎడ్జ్ సంయుక్తంగా 10వ తరగతి సీబీఎస్ఈ టాపర్లను సత్కరించారు. టెన్త్ సీబీ ఎస్ఈలో గ్రీష్మ 96.4 శాతం, తేజశ్రీ 94.4 శాతం, జి.హర్షిణి 93.3 శాతం, జెసికా 92.2శాతం సాధించారు. ఈక్రమంలో గాజువాక, మేఘాలయ సంసిద్ధ్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, టాటా క్లాస్ ఎడ్జ్ సంయుక్తంగా ఆ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. తమ కృషి, పట్టుదలతో పాఠశా లకు గౌరవం తీసుకొచ్చిన విద్యార్థుల విజయాన్ని ఈ వేడుక లో గుర్తించి, సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బల్దీప్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్, స్ట్రాటజీ, టాటా క్లాస్ ఎడ్జ్బీ అర్జిత్దే, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, టాటా క్లాస్ ఎడ్జ్, కోరమండల్ సీనియర్ హెచ్ఆర్ శ్రీకాంత్, సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఈఓ ఇందు, సంసిద్ధ్ స్కూల్, విశాఖ పట్నం ప్రిన్సిపాల్ భారతి హాజరయ్యారు.