కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం
కబైక్ను ఢీకొని దగ్ధమైన ప్రైవేటు ట్రావెలర్ బస్సు కఇప్పటి వరకు 19 మృతదేహలు గుర్తింపు
కమృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
కపీఎం మోదీ, సీఎం చంద్రబాబు, దిగ్బ్రాంతి
అక్షర కిరణం, (కర్నూలు): కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికి తీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాధితుల కుటుంబసభ్యుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది. హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. చిన్న టేకూరు వద్ద బస్సు.. ఓ బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ను ఢీకొట్టడం, వెంటనే బస్సులో మంటలు చెలరేగటంతో బైక్ మీద ఉన్న వ్యక్తితో పాటు బస్సులోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 19 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు మృతదేహాలను బస్సులో నుంచి వెలికితీశాయి.
మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన.. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో విచారణ చేయించాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు గుర్తించాలని.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాల ని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదం లో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు.
కర్నూలు బస్సు ప్రమాదం.. ఘటనాస్థలికి హోం మంత్రి అనిత
మరోవైపు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనాస్థలికి పరిశీలించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రమాద స్థలాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాలతో కలిసి పరిశీలించారు. ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు అవసరమైతే ఘటనాస్థలంలోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బస్సుప్రమాదం అత్యంత బాధాకర మన్న వంగలపూడి అనిత.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
మరోవైపు కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పలువురు చనిపోగా.. కొంతమంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. కర్నూలు కలెక్టరేట్, కర్నూలు ఆస్పత్రి, ఘటనాస్థలం వద్ద హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే..
కర్నూలు కలెక్టరేట్ - 0858 -277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి - 9121101059, ఘటనా స్థలం వద్ద కంట్రోల్ రూమ్ -9121101061
కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ -9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ -9494609814, 9052951010 బాధితుల కుటుంబసభ్యులు వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించాలని సూచించించారు.
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో సూరారంలో ఇద్దరు, జేఎన్టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది. ఇందులో సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించు కోగా.. మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ సిచ్చాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జేఎన్టీ యూ వద్ద ఎక్కిన ముగ్గురిలో.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు సమాచారం. వీరి ఆచూకీ తెలుసుకు నేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృతుల వివరాలు: ఎం.సత్యనారాయణ - సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, జయ సూర్య - మియాపూర్, హైదరాబాద్, నవీన్ కుమార్ - హయత్నగర్, హైదరా బాద్, సరస్వతీ, నిహారిక - బెంగళూరు, నీలకుర్తి రమేశ్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్ - కొత్తపేట, నెల్లూరు జిల్లా, కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష - నెల్లూరు, వీరితో పాటు చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, హైదరాబాద్లోని పటాన్ చెరులో ఉన్న ట్రావెల్స్ కార్యాలయం నుంచి గురు వారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఓ బైక్ను బస్సు ఢీకొట్టడంతో బస్సు కిందకు బైక్ దుసుకెళ్లడంతో.. పెట్రోల్ లీక్ అయ్యి మంటలు రాజుకున్నట్లు.. తర్వాత బస్సు మొత్తం వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో.. స్థానికులు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే అటుగా వెళ్తున్న ఓ మహిళ.. వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. వీడియో పోలీసులకు షేర్ చేయడంతో.. వారు ప్రమాద తీవ్రతను గుర్తించి.. వెంటనే అన్ని విభాగాలనూ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి.. గాయపడిన ఓ వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.