మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులకు ప్రణాళిక
కడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అక్షర కిరణం, (అమరావతి): ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధి కార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారుల లో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చిం చారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాల యంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృ ద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతోపాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖ శాస్త్ర వేత్తలతో సమీక్షించారు. కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామా ల మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణా ళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకో వాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ఉప్పాడ తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. వీటితో పాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె.కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశా లను పరిశీలించాలని కాకినాడ కలెక్టర్కు సూచించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిష నర్ కృష్ణతేజ, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా పీడీ చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు.