మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
అక్షర కిరణం, (అమరావతి): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. తుఫాన్ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని సీఎం సూచించారు. తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి. 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపా లిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపించింద న్నారు. తుఫాన్ నష్టంపై తాజా వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరిపంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని చెప్పారు. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయినట్టు అంచా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు చనిపోయినట్టు తెలిపారు. రాష్ట్రంలో పంచా యతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతినడంతో రూ.1,424 కోట్ల నష్టం కలిగిందని చెప్పారు. రూరల్ వాటర్ సప్లయ్కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా 3,175 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహించినట్టు వివరించారు. లి 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించా మని సీఎంకు అధికారులు తెలిపారు.