ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం
అక్షర కిరణం, (విశాఖపట్నం): సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ బ్లడ్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. రామ్ రవిశంకర్ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ, కెమికల్ ఇంజినీరింగ్ సీని యర్ లెక్చరర్ వి. శ్రీకాంత్, లెక్చరర్ సీహెచ్.వినోద్ కుమార్, విభాగాధిపతులు ఎం.మహాలక్ష్మి, సీహెచ్. జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ ఎస్.ప్రశాంతకుమారి, డి.దామోదర్, కేబీవీఎస్. ఎస్.కుమార్, డాక్టర్ ఎం.విజయలక్ష్మి ఎన్.ఎన్వీ కుమారి, పి.కృష్ణారెడ్డి, ఆర్.కోటేశ్వరరావు, బి.రామాంజనేయులు, ఎనఎసఎస్ కోఆర్డినేటర్ వి.శ్రీకాంత్, ఆఫీస్ సూపరింటెం డెంట్ కె.సాయిలక్ష్మి పాల్గొన్నారు.
జూ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఏపీ వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీకి చెందిన 12 మంది సభ్యుల బృందం విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ను పరిశీలించారు. జూ అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. స్పీకర్ మాట్లాడుతూ విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న 120 పరిశ్రమలు, బ్యాంకుల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సమీకరించి జూ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఎంపీలు ప్రతి ఏడాది రూ.50 లక్షలు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.3 కోట్లు జూకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. జూలో ప్రస్తుతం 1,404 జంతువులకు కేవలం ఒక్క పశువైద్యుడు మాత్రమే ఉండడం, 82 శాతం సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తక్షణమే అవసరమైన సిబ్బందిని నియమించి, సందర్శకులకు సరి పడా మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సదు పాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కంబాలకొండ అటవీ ప్రాంతా న్ని ఆక్రమణల నుంచి కాపాడిన విషయాన్ని కమిటీ సభ్యు లకు గుర్తు చేశారు. పర్యటనలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే లు కురుగొండ్ల రామకృష్ణ, గోండు శంకర్రావు, చింత మనేని ప్రభాకర్, ఎమ్మెల్సీలు బి.తిరుమలనాయుడు, పాల వలస విక్రాంత్ పాల్గొని, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.