మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్..
క60 మందితో కలిసి అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
అక్షర కిరణం, (మహారాష్ట్ర/జాతీయం): మావో యిస్టు పార్టీకి ఈమధ్య కాలంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్ రావు అలియాస్ సోను మంగళవారం రోజు లొంగిపోయా రు. ఆయుధాలను వీడి అధికారికంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీసుల ఎదుట ఆయన లొంగి పోయారు. అయితే ఈయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు లు కూడా లొంగిపోగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు.
ముఖ్యంగా ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడిరచారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడం తమకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నక్సలిజం పూర్తిగా అంతం కావాలని బస్తర్ ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా.. మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా, పొలిట్బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు కీలక పాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కొద్ది రోజుల క్రితమే ఆయన ఒక సంచలన లేఖను విడుదల చేశారు.
22 పేజీలతో వివరంగా లేఖ రాసిన మల్లోజుల
మొత్తంగా 22 పేజీల్లో రాసిన ఈ లేఖలో.. పార్టీ లక్ష్యం గతి తప్పిందని, అనవసర త్యాగాలు ఇక అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాలు వీడాలన్న తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ.. తనతో పాటు కేడర్లో ఉన్న 60 మందిని వెంట తీసుకెళ్తానని చెప్పారు. ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారి తీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి తాను ఎంత మాత్రమూ అర్హుడిని కాదని కూడా వివరించారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉండగా.. తానిలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని, కాకపోతే పరిస్థితుల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడిరచారు.
ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ప్రభుత్వ దళాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని.. మిగతా వారినైనా బతికించుకోవాలనే ఆశతోనే తాను లొంగిపోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే మల్లోజుల రాసిన ఈ లేఖను హిడ్మా, దేవ్జీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా అవేమీ పట్టించుకోని మల్లోజుల నేడు పోలీసుల ఎదుట లొంగి పోయారు. అగ్రనేత నుంచి ఇలాంటి ప్రకటన రాగానే.. ఉద్యమంలో తీవ్ర అలజడి మొదలైంది. దీని ఫలితంగానే మల్లోజుల కంటే ముందుగానే చాలా మంది మావోయిస్టు లు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు.