ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): ఏపీ కేడర్కు చెందిన ప్రసన్న వెంకటేష్కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి డైరెక్టర్గా నియమించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్న వెంకటేష్ ఏపీ కేడర్ 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లపాటు ఎన్టీఏ డైరెక్టర్గా కొనసాగనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి కేంద్రంలో కీలక పోస్టింగ్ దక్కింది. 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి ప్రసన్న వెంకటేష్ను చీTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డైరెక్టర్ గా కేంద్రం నియమించింది. ఆయన ఐదేళ్లపాటు సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రసన్న వెంకటేష్ నియామకానికి సంబంధించి ణశీPT (కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చీజుజుT పేపర్ లీక్, పరీక్షల నిర్వ హణ విషయంలో అవకతవకలు జరగడంతో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా పలు మార్పులు చేశారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో 47 మంది అధికారులను బాధ్యతల నుంచి తప్పించారు.. తాజాగా ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్ను నియమించారు.. వారిలో ప్రసన్న వెంకటేష్కు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
ప్రసన్న వెంకటేష్ గతంలో ఆంధ్రప్రదేశ్లో పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఆయన పరిపాలనలో కీలకంగా వ్యవహరించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కీలకమైన ఎన్టీఏ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. చీTA (నేషనల్ టెస్టింగ్) దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహిస్తుంది. ఇకపై ప్రసన్న వెంకటేష్ ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నాయకత్వం వహించనున్నారు. ఏపీకి చెందిన అధికారికి ఈ బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది.
ప్రసన్న వెంకటేష్ది తమిళనాడులోని తిరుచ్చి కాగా.. ఆయన 2012 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన తమిళనాడులో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన అనంతరం ఐఏఎస్గా ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపిక య్యారు. ఏపీలో ముందుగా పాడేరు సబ్ కలెక్టర్గా పని చేశారు. అనంతరం ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్గా, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2019లో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2022 నుంచి 2024 వరకు ఏలూరు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2024 జులై నుంచి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు.