కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఐ.వాణి
అక్షర కిరణం, (విశాఖపట్నం): కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఇసుకపల్లి వాణి నియమితుల య్యారు. ఆంధ్ర వైద్య కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆమెను కేజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ఇసుకపల్లి వాణి 1985లో ఆంధ్ర వైద్య కళాశాలలోనే ఎంబీబీఎస్, తరువాత 1992 నుంచి 95 వరకు ఎండీ గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను కేజీహెచ్లో అభ్యసించారు. 1993 నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీసులో చేరి చింతపల్లి, ఏలేశ్వరం, వంటి గిరిజన ప్రాంతాల్లోను, తరువాత సామర్లకోటలోను వైద్య అధికారిగా పని చేశారు. 1997 నుంచి ఆంధ్ర వైద్య కళాశాలతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్గా ఆ తరువాత ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. అనంతరం 2019 నుంచి గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పని చేశారు. ఇటీవలే ప్రసూతి స్త్రీల విభాగానికి ఆచార్యులుగా విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్లలో ఏడీఎంగా పదోన్నతి పొందారు. కాగా ఇసుకపల్లి వాణిని కేజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ తాను చదువుకున్న కళాశాలలో ప్రొఫెసర్గా, విభాగాధిపతిగా పని చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇప్పుడు ఎంతో కీలకమైన కేజీహెచ్ సూపరింటెం డెంట్ పదవిలో తనను ప్రభుత్వం నియమించడంపై సంతోషంగా ఉందన్నారు. తనపై ప్రభుత్వం ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానన్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించి కేజీహెచ్ ఖ్యాతిని ఇనుమడిరప చేస్తానని పేర్కొన్నారు.