మేయర్ పీలా శ్రీనివాసరావుకు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ వినతిపత్రం
క89వ వార్డులో సమస్యలపై వినతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 89వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని మేయర్ పీలా శ్రీనివాసరావుకి వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆయన మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై మేయర్ స్పందించారు. సాధ్యమైనంత త్వరగా ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ 89వ వార్డు ప్రజల తరపున నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియజేశారు.