ఒప్పందాలే జరుగుతాయి.. డెలివరీలు ఉండవు
రక్షణ రంగంలో జాప్యంపై వాయుసేన చీఫ్ రాజ్నాథ్ సింగ్ ఎదుటే తీవ్ర అసహనం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ప్రధాన రక్షణ ప్రాజెక్టులలో కొనసాగుతున్న జాప్యాలపై భారత వైమానిక దళాధిపతి (IAఖీ) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందాలు జరుగుతాయని కానీ, డెలివరీలు మాత్రం మొదలుపెట్టరని ఆయన అసంతృప్తి వెళ్గగక్కారు. ‘ప్రతి ప్రాజెక్టు జాప్యం అవుతుంది. సమయాన్ని పాటించడం అత్యంత కీలకం. కొన్ని సమయాల్లో అసాధ్యమని తెలిసినా మేమే ఒప్పందాన్ని చేసు కుంటాం.. మొదటి నుంచే యథార్థంగా, పారదర్శకంగా ఉండా లి’ అని ఉద్ఘాటించారు. న్యూఢల్లీిలో జరిగిన సీఐఐ వార్షిక సమా వేశంలో పాల్గొన్న ఆయన.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి ‘మాకు క్యాప బిలిటీ మాతమే కాకుండా కెపాసిటీ కావాలి. కేవలం ఇండియాలో ఉత్పత్తి చేస్తే సరిపోదు.. ఇక్కడే రూపకల్పన చేసి అభివృద్ధి చేయా లి. అవసరమైన సామర్థ్యం అభివృద్ధి చేయాలి. శక్తివంతమైన ఉత్పత్తి వ్యవస్థ కోసం దళాలు, పరిశ్రమ మధ్య పరస్పర విశ్వాసం, కమ్యూనికేషన్ కొనసాగాలి. మన సంబంధం బలంగా ఉండా లంటే పారదర్శకంగా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.
మేకిన్ ఇండియాలో వాయుసేన ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. యుద్ధ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ప్రైవేట్ రంగంపై దేశానికి నమ్మకం ఉందని, ఇది భారీ మార్పులకు దారి తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలాసార్లు ఒప్పందాలు జరుగుతున్నాయని, కానీ ఆయుధాలు మాత్రం అందడం లేదని ఎయిర్ మార్షల్ సింగ్ అన్నారు. అసలు సమస్య సమయపాలన లేకపోవడమేనని పేర్కొన్నారు. ‘సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తుకు రావడం లేదు.. మనం చేయలేని పనికి ఎందుకు వాగ్దానాలు చేయడం?’ అని ఆయన ప్రశ్నించారు. తేజస్ వీఖ1 ఇప్పటికే ఆలస్యమైందని, తేజస్ వీఖ2 నమూనా కూడా ఇంకా రాలేదని ఆయన అన్నారు. AవీజA ఫైటర్ నమూనా విమానం కూడా ఇప్పటి వరకు రాలేదని ఆయన విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వాయుసేన చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది.
మన దళాలు, పరిశ్రమల మధ్య నమ్మకం పెరగాలని ఎయిర్ మార్షల్ సింగ్ అన్నారు. పారదర్శకత చాలా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ‘మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే.. దానిని అందించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. మేకిన్ ఇండి యా కోసం వాయుసేన శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ‘మనం ఈరోజు సంసిద్ధంగా ఉంటేనే.. భవిష్యత్తుకు సన్నద్ధం కాగలము. రానున్న పదేళ్లలో.. మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. కానీ, ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తిమంతం చేసు కొంటేనే యుద్ధాలు గెలుస్తాం’ అని అన్నారు. AవీజA ప్రాజెక్టును ప్రైవేటు సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారని ఆయన తెలిపారు. ‘ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేటు రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు వేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి. తదుపరి పదేళ్లలో మన పరిశ్రమ, డీఆర్డీఓ నుంచి మంచి ఫలితాలు రానున్నాయి. కానీ, ఈ రోజు అవసరం ఉన్నది ఈ రోజే కావాలి. వేగంగా స్పందించాలి.. దీర్ఘకాలిక రూపకల్పన కొనసాగుతుండగానే తక్షణ అవసరాల్ని తీర్చేందుకు ‘ఫాస్ట్-ట్రాక్ మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలు ప్రారంభించాలి’ అని అన్నారు.
కాగా, వైమానిక దళాధిపతి ఆయుధాల డెలివరీపై విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా తేజస్ డెలివరీలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలి. వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలి. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటి వరకు తొలి 40 విమానాల డెలివరీ కూడా పూర్తికాలేదు’ అని ఆయన అన్నారు.