రామనారాయణ క్షేత్రంలో ఘనంగా యోగాంధ్ర
అక్షర కిరణం, (విజయనగరం): జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈక్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణుని వద్ద రామధనుస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీని వాస్, కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు యోగాసనాలు వేశారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యం లో యోగ గురువులు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమతి, ఆరి సుందర శివరావు అందరితో 45 నిముషాల పాటు పలు యోగసనాలు వేయించారు. యోగాసనాల ప్రదర్శన అనం తరం అందరికీ రామనారాయణ దర్శనాన్ని కల్పించడంతో పాటు తీర్ధ ప్రసాదాలను ఎన్.సి.ఎస్.ట్రస్టు ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పర్యాటక అధికారి కుమారస్వామి, డీఎస్డీవో వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో జీవనరాణి, ఆయుష్ అధి కారి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్ తదితరులను ఎన్సీఎస్ ట్రస్టు ప్రతినిధులు దుశ్శాలువతో సత్కరించారు.