90వ వార్డులో తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖ నగర అభివృద్ధే ధ్యేయంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శుక్ర వారం ఆయన జీవీఎంసీ 8వ జోన్ 90వ వార్డు లక్ష్మీనగర్ సెయింట్ థెరిసా స్కూల్ తదితర ప్రాంతాలలో రూ.190 లక్షలతో పలు చోట్ల తారు రోడ్డు నిర్మాణం, సెంటర్ డివైడర్, కవర్ స్లాబ్, ఎంఎస్ గిల్స్, పెయింటింగ్ తదితర పనులకు 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణతో కలిసి శంకు స్థాపన చేశారు. నగర మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి వార్డును అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేయాలన్న ధ్యేయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమా లు చేపడుతుందన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న పార్వతి చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో 8వ జోన్ జోనల్ కమిష నర్ హేమావతి, కార్యనిర్వాహక ఇంజినీరు దిలీప్, ఉపకార్య నిర్వహక ఇంజనీర్ ప్రవీణ్, ఏఎంఓహెచ్ అప్పలనాయుడు, ఏపీడీ చిరంజీవి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.