పట్టుకున్న చేప ప్రాణాలు తీసింది..
మరో చేపను పట్టుకుందామని చేతిలో ఉన్న చేపను నోట కరిచిన యువకుడు
అది గొంతులో దూరడంతో ఊపిరాడక మృతి చెందిన యువకుడు మణికందన్
అక్షర కిరణం, (తమిళనాడు/జాతీయం): ఓ చిన్న చేప పిల్లే ఓ యువకుడి ప్రాణం తీసింది. చేతులతోనే చేపలు పట్టే టాలెంట్ కల్గిన అతడు.. ఓ సరస్సు లో చేపలు పడుతున్నాడు. అయితే ముందుగా ఓ చేపను పట్టిన అతడి మరో దాన్ని పట్టాలని ప్రయత్నించాడు. కానీ అది చేతిలోనే ఉండేసరికి పట్టరాకపోవడంతో ఆ చేప ను నోట కరుచుకుని మరో చేపను పట్టే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ చేప అతడి నోట్లోకి దూసు కెళ్లింది. అది గొంతులో ఇరు క్కోగా యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా అరయపక్కం గ్రామా నికి చెందిన 29 ఏళ్ల మణికందన్కు చిన్నప్పటి నుంచే చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. అయితే అందరిలాగా వలలు, ఎర వేసి పట్టకుండా.. తానే చేతులతో స్వయంగా పట్టుకుంటాడు. నీళ్లలోకి వంగి చేతులతోనే చేపలను బయటకు తీస్తాడు. మణికందన్కు చేపలు తినాలనిపించి నప్పుడల్లా స్థానిక చెరువులు, సరస్సుల వద్దకు వెళ్లి స్వయం గా పట్టుకుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా అతడు చేపలు పట్టాలనుకున్నాడు. అందుకోసం మణి కందన్ తక్కువ నీటి మట్టాలు ఉన్న కీళవలం సరస్సు వద్దకు వెళ్లాడు. నీళ్లలోకి దిగి చేతులతో ఓ చేపను పట్టాడు. అయితే వెంట ఏమీ తీసుకెళ్లకపోవడం, దానికి ఇంకా ప్రాణం ఉండడంతో దాన్ని కింద పెట్టలేకపోయాడు. ఓ చేతి లో దాన్ని పట్టుకునే మరోదాన్ని పట్టబోయాడు. కానీ ఒక్క చేత్తో చేపలు పట్టడం కుదరకపోవడంతో చేతిలో ఉన్న చేప ని నోట కరుచుకున్నాడు. ఆపై మరిన్ని చేపలు పట్టేందుకు నీళ్లలోకి వంగాడు. పక్కనున్న వారంతా మణికందన్ చేతుల తో చేపలు పడుతుండడం చూసి ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈక్రమంలోనే నోట కరిచిన చేప మూతి గొంతులోకి ఉండ డంతో.. భయంతో ఆ చేప లోపలికి చొచ్చుకుపోయింది.
దీంతో మణికిందన్ గొంతు పట్టుకుని తెగ ఆయాసపడుతూ కనిపించాడు. పక్కనుండి చూస్తున్న వారంతా నోట్లో ఉన్న చేపను బయటకు లాగాలని చాలానే ప్రయత్నించారు. కానీ అది మరింత భయపడి గొంతులోకి వెళ్లిపోయింది. ఫలితంగా అతడికి శ్వాసఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యాడు. స్థానికులు వెంటనే స్పందించిన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మణికందన్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సాధారణ చేపలు నోట కరిస్తే ఈ సమస్య వచ్చుండేది కాదని.. కానీ మణికందన్ నోట్లో పెట్టుకున్నది సనంగొట్టై చేప అని స్థానికులు వివరించారు.
క్లైంబింగ్ పెర్చ్ (అనాబాస్ టెస్టూడినియస్)గా పిలిచే పనంగొట్టై చేప... తేమగా ఉన్నచోట నుంచి బయటపడేందు కు శక్తి కల్గి ఉంటుందని తెలిపారు. దీనికి పదునైన ముళ్లు గల రెక్కలు ఉంటాయని.. అవి భయపడినా, ప్రమాదంలో ఉన్న వాటిని ఉపయోగించుకునే ప్రాణాలు కాపాడుకుంటా యన్నారు. మణికందన్ దాన్ని నోట కరవడంతో భయపడి గొంతులోకి చొచ్చుకుపోయిందని.. ఈక్రమంలోనే దాని రెక్కలు మరింత పెద్దవిగా మారి ప్రాణాలు కోల్పోయాడని వెల్లడిరచారు.