ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రజా దర్బార్
అక్షర కిరణం, (పొందూరు): ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికే కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్ నిర్వ హిస్తోందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రం ఆమదాలవలస లో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్య లను పరిష్కారించే దిశలో అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అదేశాలిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కూన సత్యారావు, ఎం.రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.