17న జోన్`4లో పలు వాణిజ్య సముదాయాలకు బహిరంగ వేలం పాట
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 4 జోన్లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, కళ్యాణ మండపం, మార్కెట్లకు బహిరంగ వేలం పాట నిర్వహిం చనున్నట్టు 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్) గ్రౌండ్ ప్లోర్లో 8, 9,10,11, 12,13(Gవఅ), 15(ూజ) షాపు రూములు, మొదటి అంతస్తులో 2(ూజ), 3,4,5,6,7,8,9,10,11,12,13, 14, 15(Gవఅ) షాపు రూములు, జగదాంబ వాణిజ్య సముదాయము (వార్డు నెం.31) 3,5,9, 10, 11, 12, 14, 13(ూు) షాపు రూములు, పాత బస్టాండ్ ఫేస్-2(వార్డు నెం.35) 1,2,3,4,5,6,8,10,11,13,14, 7(ూజ), 9(ూు), 12(ూజ) షాపు రూములు, పద్మనగర్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.39, లక్ష్మిటాకీస్ దగ్గర) 1,4,6,7,11, 12(Gవఅ), 8(ూజ), షాపు రూములు, సూర్యబాగ్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.31, నియర్ జీవీఎంసీ, జోన్-4 ఆఫీసు) 9(ఫస్ట్ ప్లోర్) షాపురూము, టీఎస్.ఆర్ వాణిజ్య సముదాయం (వార్డు నెం.31) 39,47,51 షాపు రూములు, టి.ఎస్.ఆర్ వాణిజ్య సముదాయం వెస్ట్ సైడ్ (గ్రౌండ్ ప్లోర్) (వార్డు నెం.31) 01 షాపు రూము, అంబేద్కర్ కళ్యాణ మండపం (వార్డు నెం.37), రెల్లివీధి రోడ్ సైడ్ షిప్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు 17-04-2025 తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్టు జోనల్ కమిషనర్ తెలిపారు.
సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో 4వ జోనల్ కార్యాలయంలోని పర్యవేక్షకును సంప్రదించగలరని జోనల్ కమిషనర్లు తెలిపారు.