చెట్లు నరికితే.. ఒక్కోక్క వృక్షానికి రూ.లక్ష జరిమానా
కసుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు కరాత్రికి రాత్రే 454 చెట్లను నరికేసిన నిందితుడు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికి పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్లో రాత్రికి రాత్రే ఏకంగా 454 చెట్లను నరికేసిన వ్యక్తి అభ్యర్థన ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అంతేకాదు, చెట్లను నరికివేసే కేసుల్లో ఎంత జరిమానా విధించాలో ప్రమాణం నిర్దేశించింది. ఈవిషయంలో సీనియర్ న్యాయవాది ఏడీ ఎన్ రావు సూచనను ధర్మాసనం అంగీకరించింది. చెట్ల ను తేలికగా తీసుకోరాదని, చట్టాన్ని ఉల్లంఘించిన నేరస్థు లకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కోరారు. చెట్లు నరికి వేతపై నిషేధం ఉన్నా శివ శంకర్ అగర్వాల్ అనే వ్యక్తి అను మతి లేకుండా 454 చెట్లను నరికేశాడు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అతడి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన క్లయింట్ చేసిన తప్పును ఒప్పుకున్నాడని, జరిమానా చాలా ఎక్కువగా ఉందని తగ్గిం చాలని కోరాడు. మొక్కలు నాటడానికి అనుమతి ఇవ్వా లని, అదే స్థలంలో కాకుండా వేరే చోట కూడా నాటుతాడ ని చెప్పాడు. కానీ, జరిమానా తగ్గించడానికి నిరాకరించిన కోర్టు.. వేరే ప్రాంతంలో మొక్కలు నాటడానికి అనుమతిం చింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికలో శివ శంకర్ అగర్వాల్ 454 చెట్లను నరికేశాడని తెలిపింది. ఒక్కో చెట్టుకు రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది.
వృందావన్ చటికర రోడ్డులో రక్షిత అటవీ ప్రాంతం లో గతేడాది సెప్టెంబర్ 18న రాత్రికి రాత్రే 454 చెట్లను అక్రమంగా నరికేశారు. వాటిలో 422 చెట్లు దాల్మియా ఫామ్ అనే ప్రైవేట్ భూమిలోనూ.. మిగతా 32 రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్నాయి. సీఈసీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఇది చాలా దారుణమైన విషయమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అగర్వాల్పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది. దీనిపై మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఈసీకి సూచించింది.
యూపీ వృక్ష సంరక్షణ చట్టం 1976 ప్రకారం అటవీ శాఖ జరిమానా వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1972 ప్రకారం ప్రభుత్వ భూమిలో 32 చెట్లను నరికినందుకు భూ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపింది. ‘‘పర్యావరణ కేసులో దయ చూపకూడదు. చెట్లను నరికివేయడం మనిషిని చంపడం కంటే దారుణం... 454 చెట్లు తిరిగి పెరగడానికి కనీసం 100 ఏళ్లు పడుతుంది. కోర్టు అనుమతి లేకుండానే వాటిని నరికేశారు అని ధర్మాసనం పేర్కొంది.